‘కేజీఎఫ్’ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేనవసరం. ఎలాంటి అంచనాలు లేకుండా 2018 విడుదలైన ఈ మూవీ రికార్డులు సృష్టించింది. దీంతో ఈ మూవీకి సిక్వెల్గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది.
దీంతో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటనపై అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100 శాతం ఆక్యూపెన్సితో థియేటర్ల ఓపెనింగ్కు ప్రభుత్వాలు అనుమనితిని ఇచ్చాయి. అయినప్పటికీ మేకర్స్ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనే అనుమానంతో సినిమాల విడుదలపై వెనకడుగు వేస్తున్నారు.
అంతేగాక థర్డ్వేవ్ కూడా పొంచి ఉండటంతో మేకర్స్ డైలామాలో పడుతున్నారు. ఈ క్రమంలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీ మేకర్స్ తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ‘గ్యాంగస్టర్స్తో హాల్ ఎప్పుడైతే నిండిపోతుందో అప్పడే మాన్స్టర్ వస్తాడు. ఆయన వచ్చే తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అంటూ తమదైన శైలిలో మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. కాగా ప్రశాంత్ నీల్దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటి రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.