కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్దేశి జంటగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. దర్శకులు ప్రశాంత్ నీల్, కిశోర్ తిరుమల దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం తిరుపతిలో మొదలైంది.
‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘వినూత్న కథతో ఈ చిత్రం రూపొందుతోంది. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో 80శాతం షూటింగ్ చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: విశ్వాస్ డేనియల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూ సర్స్: సత్య గమిడి, శరత్చంద్ర నాయుడు, సహనిర్మాత: బాబు.