ప్లాస్మా దానం చేస్తా

17 Sep, 2020 06:38 IST|Sakshi

తెలుగు ఇండస్ట్రీలోనూ కరోనా వ్యాప్తి చెందుతోంది. ఆ మధ్య దర్శకుడు రాజమౌళి, ఆయన  కుటుంబ సభ్యులు, తేజ వంటి వారు కోవిడ్‌ బారినపడ్డారు. తాజాగా నటుడు నాగబాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ద్వారా ఆయనే తెలిపారు. ఈ విషయం గురించి ఇలా రాసుకొచ్చారాయన. ‘వైరస్‌ అనేది ప్రతిసారీ మనల్ని బాధకు గురి చేసేది కాదు, ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని కూడా కల్పించేది అవుతుంది. కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీన్ని తట్టుకుని నిలబడి ప్లాస్మా దానం చేయాలనుకుంటున్నాను’ అన్నారు నాగబాబు.

మరిన్ని వార్తలు