ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదో భారీ బడ్జెట్ ఫ్యాంటసీ చిత్రం. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎవరు కనిపిస్తారు? సీత పాత్ర ఎవరు చేయబోతున్నారు? అని బాలీవుడ్లో ఎప్పటికప్పుడు చాలా పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య అనుష్కా శర్మ, శ్రద్ధా కపూర్, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. తాజాగా కృతీ సనన్తో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందని, హీరోయిన్గా ఆమె ఖరారైనట్టే అని బాలీవుడ్ టాక్. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.