ఏడు పాత్రల మథనం

19 Oct, 2020 05:33 IST|Sakshi

మానస్‌ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ కుమార్‌ హీరోలుగా అక్షత సోనావని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్‌ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్‌ అండ్‌ హార్ట్‌ క్రియేష¯Œ ్స ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని ‘నీ పేరు పిలవడం... నీ పేరు పలకడం..’  గీతాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమణి రాసిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. అజయ్‌ అరసాడ సంగీతం అందించారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అన్నారు అనిల్‌ పంగలూరి. ఈ చిత్రానికి కెమెరా: సంతోష శానమోని, సహదర్శకుడు: కిషోర్‌ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి.

మరిన్ని వార్తలు