ఫ్యాన్స్‌కి ఖుషీ?

12 Oct, 2020 00:33 IST|Sakshi

మూడేళ్ల విరామం తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వం వహించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘పెళ్లి సందడి’ టైటిల్‌నే ఈ కొత్త సినిమాకు పెట్టారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ నటిస్తారని టాక్‌. అలాగే హీరోయిన్‌గా శ్రీదేవి చిన్న కుమార్తె, జాన్వీ కపూర్‌ చెల్లెలు ఖుషీ కపూర్‌ కనిపించే అవకాశం ఉందట. హీరోయిన్స్‌ పేరు ప్రస్తావనలో ఖుషీ కపూర్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో అనేక బ్లాక్‌బస్టర్స్‌లో కనిపించారు శ్రీదేవి. ఆమె కెరీర్‌లో ముఖ్యమైన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. తెలుగులో శ్రీదేవి ఓ ప్రత్యేకమైన స్థానం. ఖుషీ తెలుగు తెరకు పరిచయం అయితే శ్రీదేవి అభిమానులు ఖుషీ అవుతారు. మరి ఖుషీ ఇస్తారా? చూడాలి. ఒకవేళ ఈ సినిమా అంగీకరిస్తే ఇదే ఖుషీ కపూర్‌కి తొలి సినిమా అవుతుంది. ఇంకా హిందీలో కూడా ఆమె నటించలేదు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘పెళ్లి సందడి’కి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు