Puneeth Rajkumar Wife Ashwini: అప్పు చివరి చిత్రం చూడలేను, అందుకే వెళ్లలేదు

19 Mar, 2022 11:23 IST|Sakshi
ఫైల్‌ఫోటో

Ashwini Puneeth Rajkumar About James Movie: దివగంత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌‌కుమార్ చివరిగా నటించిన ‘జేమ్స్’ చిత్రం మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పునీత్ జయంతి(మార్చి 17) సందర్భంగా జెమ్స్‌ మూవీ విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు అప్పు ఫ్యాన్స్‌ థియేటర్లకు పొటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. మార్చి 25వరకు కర్ణాటక అన్ని థియేటర్లో జెమ్స్‌ మూవీ మాత్రమే వేయనున్నారు. అప్పును చివరి సారిగా తెరపై చూసి ఫ్యాన్స్‌ కన్నీటి పర్యంతం అవుతున్నారు. బరువెక్కిన హృదయాలతో అభిమానులు థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు.

చదవండి: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ మూవీపై ప్రకాశ్‌ రాజ్‌ షాకింగ్‌ కామెంట్స్‌, ట్వీట్‌ వైరల్‌

ఇదిలా ఉంటే ఓ ఇంటర్య్వూలో అప్పు చివరి చిత్రం జేమ్స్‌పై ఆయన భార్య అశ్విని పునిత్‌ రాజ్‌కుమార్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ‘‘తాను జేమ్స్’ సినిమా చూడలేను అన్నారు. ఎందుకంటే అందరిలా నేను ఆ సినిమా చూడలేకపోవచ్చు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. జేమ్స్‌ మూవీ బాగా రూపుదిద్దుకుందని చిత్రబృందం, ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ నేను చూడలేను కాబట్టి వెళ్ళలేదు.. జేమ్స్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి పునీత్ నాకు చాలాసార్లు చెప్పారు. సినిమాలో వాడుతున్న టెక్నాలజీ గురించి కూడా ఆయన వివరించారు’ అని అశ్విని తెలిపారు.

చదవండి: ఫుడ్‌ డెలివరి బాయ్‌గా మారిన స్టార్‌ కమెడియన్‌, ఫొటో వైరల్‌

ఇండస్ట్రీలో అన్ని రంగల్లోనూ కొత్తవారికి చోటు కల్పించాలనేది పునిత్‌ ఆశయం అని అశ్విని అన్నారు. ‘మా సంస్థ పీఆర్‌కే(పునిత్‌ రాజ్‌కుమార్‌ ప్రొడక్షన్‌) ద్వారా ఇది కొనసాగుతుంది. మా బ్యానర్‌ నుంచి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్‌ కాకపోయాన మా బెస్ట్‌ ఇవ్వగలిగాం. అప్పును కోల్పోయిన బాధలో ఉన్న మాకు ఆయన అభిమానులు అండగా నిలిచారు. ఆయన బర్త్‌ యానివర్సరీ రోజున రక్తదానం, నేత్రదానం, అన్నదానం వంటి అనేక కార్యక్రమాల ద్వారా అప్పును బతికించారు’ అంటూ అశ్విని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా అప్పు చివరి మూవీని ఆయన సోదరులు శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌,  ఆయన కుమార్తె వందిత, వినయ్‌ రాజ్‌కుమార్‌, యువ రాజ్‌కుమార్‌లు సహా మిగతా కుటుంబ సభ్యులు వీక్షించారు.

మరిన్ని వార్తలు