బాలరాజు.. ‘మల్లిక’ వచ్చేసింది

24 Oct, 2020 13:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు  చల్లగా’.  ఈ సినిమాలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’  పాత్రలో కనపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరోయిన్‌గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి సంబంధించిన పాత్రను పరిచయం చేసింది. లావణ్య ఇందులో ‘ మల్లిక’ పాత్రలో కనిపించనున్నారు.

ఫప్ట్ లుక్‌ పోస్టర్‌ను లావణ్య తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చావు కబురు చల్లగా’ మూవీలో ఇదే నా ఫస్ట్ లుక్‌’ అంటూ కాప్షన్‌ జత చేశారు.  నీలం రంగు చుడీదార్ ధరించి ఉన్న ఈ కొత్త లుక్‌లో లావణ్య నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఇప్పటికే కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అరవింద్‌ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌పై బ‌న్నీ వాసు నిర్మాతగా వ్యహరిస్తున్నారు.  నూతన దర్శకుడు కౌశిక్‌ పెగ‌ళ్ల‌పాటి తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని వార్తలు