రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం లైగర్. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఓ రేంజ్లో మార్మోగుతున్నాయి. మరోవైపు చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దేశాన్ని చుట్టొస్తోంది. విజయ్, అనన్య పాండే ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా ఇంకా మరికొన్ని సిటీలను పలకరించాల్సి ఉంది. దేశాన్ని చుట్టొస్తున్న కొడుకు సురక్షితంగా ఉండాలంటూ పూజలు చేసింది రౌడీ హీరో తల్లి.
ఈ విషయాన్ని విజయ్ స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. 'దాదాపు ఈ నెలంతా ఇండియాను చుట్టాల్సి ఉంది. ఇప్పటికే మేము ఎన్నో నగరాలు తిరిగాం, ఎంతో ప్రేమను పొందాం.. కానీ అమ్మ మాకు రక్షణ అవసరమని భావించింది. కాబట్టి ఇంట్లో పూజ చేసి, మా అందరికీ తాయత్తులు కట్టింది. ఇక మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నంతసేపు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది' అంటూ పూజకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో విజయ్, అనన్య తాయత్తులు కట్టుకున్నట్లు తెలుస్తోంది.
This whole month touring across India and receiving so much love already felt like God's blessing!
But Mummy feels we needed his protection :)
So Poooja 😌🙏 and sacred Bands for all of us 🥰
Now she will sleep in peace while we continue our tour 😘❤️#Liger pic.twitter.com/q6ew2HFzik
— Vijay Deverakonda (@TheDeverakonda) August 17, 2022
చదవండి: ప్రభాస్ ‘సలార్’-‘హృతిక్’ ఫైటర్ ఢీకొట్టనున్నాయా?!
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్... అనురాగ్ అంచనాలు నిజమైతే!