Saisha Shinde-Lock Upp: ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ హోటల్‌కు రమ్మన్నాడు, నాలాగే 8 మంది!

3 May, 2022 15:52 IST|Sakshi

లాకప్‌ షోతో ప్రకంపనలు సృష్టిస్తోంది బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌. ఈ షోలోని కంటెస్టెంట్లు బయటపెట్టే సీక్రెట్లు సోషల్‌ మీడియాలో ఎంత సెన్సేషన్‌ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ లాకప్‌ షోలోని కంటెస్టెంట్‌ సాయేషా షిండే మరో సంచనల సీక్రెట్‌ బయటపెట్టింది. ఆమె ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి ముందు స్వాప్నిల్‌ షిండేగా ఫ్యాషన్‌ వరల్డ్‌లో సేవలందించాడు. 2021లో ట్రాన్స్‌వుమెన్‌గా మారి సాయేషా షిండేగా పేరు మార్చుకున్నాడు.

తను జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి చెప్తూ.. 'కెరీర్‌ ఆరంభించిన తొలినాళ్లలో (బహుశా 2006వ సంవత్సరంలో) జరిగిందీ సంఘటన. ఆ ఇండియన్‌ డిజైనర్‌ (పేరు చెప్పలేదు) నా ఫేవరెట్‌. అతడిని కలిసినప్పుడు నేను ఆకర్షితురాలినయ్యాను. ఓసారి నన్ను హోటల్‌ గదికి పిలిచాడు, వెళ్లాను. ఎంతో డబ్బు, పేరుప్రఖ్యాతలు ఉన్నా తనకు ప్రేమను పంచేవాళ్లే లేరని బాధపడ్డాడు. నేను అతడిని ఓదార్చుతూ హగ్‌ చేసుకున్నా.. అలా ఇద్దరం బెడ్‌ షేర్‌ చేసుకున్నాం. ఆ తర్వాత కూడా అతనితో టచ్‌లో ఉన్నా. కానీ కొద్దిరోజులకే నాకు తెలిసిందేంటంటే.. నా ఫ్రెండ్స్‌కి కూడా ఇలాగే బాధలో ఉన్నాడంటూ కహానీలు చెప్పి 7-8 మంది అబ్బాయిలతో హోటల్‌లో బస చేశాడట.

ఈ వార్త బయటకు పొక్కడంతో నన్ను ఇండస్ట్రీలో నుంచి బ్యాన్‌ చేశారు. నేనే అతడి గురించి అంతటా చాటింపు చేస్తున్నాను అనుకుని ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. నిజానికి నేను ఎవరికీ చెప్పలేదు' అని తెలిపింది. దీనిపై కంగనా స్పందిస్తూ 'ఇండస్ట్రీలో జరిగేది ఇదే. మీటూ ఉద్యమం సమయంలో కూడా ఇలాగే జరిగింది. ఎంతోమంది అమ్మాయిలు తమ వేధింపుల గురించి బాహాటంగానే ప్రస్తావించారు. ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తుల పేర్లను బయటపెట్టారు. కానీ ఎవరైతే అలా ముందుకువచ్చి మాట్లాడారో వాళ్లందరూ కనిపించకుండా పోయారు, కానీ వేధించినవాళ్లు మాత్రం ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతున్నారు. మీటూ ఉద్యమానికి మద్దతు పలికినందుకు నన్ను కూడా చిత్రపరిశ్రమలో బ్యాన్‌ చేశారు' అని చెప్పుకొచ్చింది. కాగా లాకప్‌ షో గ్రాండ్‌ ఫినాలే మే7న జరగనుంది.

చదవండి:  రాకింగ్‌ రాకేశ్‌కు కాస్ట్‌లీ ఫోన్‌ గిఫ్టిచ్చిన సుజాత

 సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్‌ రివీల్‌ చేసిన యాంకరమ్మ

మరిన్ని వార్తలు