Nenevaru Movie: లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న 'నేనెవరు' .. త్వరలో రిలీజ్ డేట్ ఫిక్స్

5 Nov, 2022 21:05 IST|Sakshi

ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ నటిస్తున్న చిత్రం 'నేనెవరు'. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మిస్తుండగా.. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ విలన్‌గా నటిస్తున్నారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

(చదవండి: పంత్ కోసం కాదట .. ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా..!)
     
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "నేనెవరు" అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలిపారు. చిత్రబృందానికి చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు పేర్కొన్నారు. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ప్రధాన పాత్రలు పోషించారు. 

మరిన్ని వార్తలు