సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగÔó ఖర్ మూవీస్ బ్యానర్పై భావన, రవి నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఆడియో హక్కులను కర్ణాటకకు చెందిన ఆనంద్ ఆడియో సంస్థ 75లక్షలకు సొంతం చేసుకుంది. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగశేఖర్ మాట్లాడుతూ –‘‘సత్యదేవ్, తమన్నా కాంబినేసన్ అనగానే ట్రేడ్లో మంచి క్రేజ్ ఏర్పడింది. మా చిత్రం టైటిల్ విన్నవారంతా ప్రేమకథలు శీతాకాలంలోనే మొదలవుతాయని, తమ ప్రేమకథలను గుర్తు చేసుకుంటున్నారు. టైటిల్ పొయెటిక్గా ఉంది అంటుంటే ఆనందంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య హెగ్డే, లైన్ప్రొడ్యూసర్స్: సంపత్కుమార్, శివ్దశ్ యశోదర.