పండగ తర్వాత బిజీ

9 Jan, 2021 00:21 IST|Sakshi

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆరంభించడానికి డేట్‌ ఫిక్స్‌ చేశారని తెలిసింది. ఈ నెల 20న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు చిరంజీవి. 20 నుంచి ‘ఆచార్య, లూసీఫర్‌’ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌తో చిరంజీవి బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందే ‘లూసీఫర్‌’ రీమేక్‌ పొలిటికల్‌ డ్రామా. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. 

మరిన్ని వార్తలు