MAA Elections 2021: 'చెప్పుకోవడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంది'

10 Oct, 2021 18:24 IST|Sakshi

MAA Elections 2021: నటుడు శివ బాలాజీ నిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నటి హేమ శివబాలాజీ చేయిని కొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్‌ హాస్పిటల్‌లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్‌ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్‌ తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ!

అయితే హేమ ఎందుకు కొరికిందో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయం చెప్పుకోవడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. టీటీ ఇంజెక్షన్‌ చేయించుకున్న అనంతరం నరేశ్‌తో కలిసి శివబాలాజీ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. చదవండి: అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ

మరిన్ని వార్తలు