హిందీలోకి మానగరం

29 Sep, 2020 06:29 IST|Sakshi

సందీప్‌ కిషన్, శ్రీ, రెజీనా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మానగరం’. ‘నగరం’ టైటిల్‌తో తెలుగులో విడుదలైంది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఒక్క రాత్రిలో జరిగే కథాంశంగా ఈ సినిమా ఉంటుంది.  ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్‌ చేస్తున్నారు. విక్రాంత్‌ మాస్సీ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ కెమెరామేన్‌ సంతోష్‌ శివన్‌ డైరెక్ట్‌ చేయబోతున్నారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు