Mahesh Babu -Namrata Love Story : నమ్రతను మహేశ్‌ ఫ్యామిలీ ఒప్పుకోలేదట.. ఏం చేశారంటే

10 Feb, 2023 15:27 IST|Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో మహేశ్‌ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల పేరు ముందుంటుంది. తెరపైనే కాదు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వీరి జోడికి ఎంతోమంది అభిమానులున్నారు. మహేశ్‌వరుస సినిమాలతో బిజీగా ఉంటే, నమ్రత ఇంటి బాధ్యతలతో పాటు మహేశ్‌ కాస్ట్యూమ్స్‌ విషయాల్లోనూ చురుగ్గా ఉంటుంది. దీనికి తోడు మహేశ్‌ వ్యాపారాలన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనేంతలా ఉండే ఈ అందమైన జంట పరిచయం ఎలా మొదలైంది? అసలు ఫస్ట్‌ ప్రపోజ్‌ చేసింది ఎవరు? అంత స్టార్‌డమ్‌ ఉండి సీక్రెట్‌గా పెళ్లెందుకు చేసుకున్నారు వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఇప్పుడు చూద్దాం.

మహేశ్‌బాబు, నమ్రతలు తొలిసారి వంశీ సినిమా షూటింగ్‌లో కలుసుకున్నారు. అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ న్యూజిలాండ్‌ వెళ్లారట.దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్‌ చేశారు. ఆ సమయంలోనే మహేశ్‌-నమ్రతల స్నేహం మరింత బలపడింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది. న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారట. 

ఇక్కడే మరో ట్విస్ట్‌ కూడా ఉంది. వీరి ప్రేమను మహేష్‌ కుటుంబం తొలుత అంగీకరించలేదట.దీంతో మహేశ్‌ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట.అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించింది. అలా ఈ ప్రేమ మజిలీ పెళ్లిదాకా వెళ్లింది. 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్‌లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్‌. 

సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్‌-నమ్రతల రిలేషన్‌ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం. వీరి పెళ్లి జరిగే వరకు ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 18ఏళ్ల వైవాహిక బంధంతో ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ కపుల్‌గా ఆదరణ పొందుతున్న మహేశ్‌, నమ్రతల దంపతులకు పలువురు సెలబ్రిటీల నుంచి పెళ్లిరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు