Mahesh Babu: బుర్జ్‌ ఖలీఫాపై మహేశ్‌, వంశీ పైడిపల్లి కుటుంబాల సందడి

31 Dec, 2021 14:59 IST|Sakshi

 సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తుంటారు. ఇటీవలె మోకాలి సర్జరీ కోసం దుబాయ్‌ వెళ్లిన మహేశ్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అక్కడే ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్న ఆయన తాజాగా న్యూ ఇయర్‌ వేడకలు జరుపుకుంటున్నారు.

డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి సైతం ఫ్యామిలీతో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో జాయిన్‌ అయ్యారు. దీంతో దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీపా దగ్గర వీరంతా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు