Indira Devi Death: ఇందిరా దేవి మృతి, నానమ్మను తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చిన సితార

28 Sep, 2022 11:57 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం స్టార్‌ హీరో మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణం మహేశ్ కుటుంబం, ఇతర కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది.

ఇక నానమ్మ మరణంతో మహేశ్‌ కూతురు సితార ఏడుస్తున్న దృశ్యం అందరిని చేత కంటతడి పెట్టిస్తోంది. తండ్రి మహేశ్‌ని పట్టుకుని నానమ్మను తలుచుకుంటూ సితూ పాప వెక్కె వెక్కి ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సితార ఏడుస్తుంటే మహేశ్‌ ఆమెను ఓదారుస్తున్నాడు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: 
మహేశ్‌ బాబు ఇంటికి సినీ ప్రముఖులు, ఇందిరా దేవికి నివాళులు
మహేశ్‌ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం

మరిన్ని వార్తలు