బీఏ రాజు హఠాన్మరణం: మహేష్‌బాబు భావోద్వేగం

22 May, 2021 08:08 IST|Sakshi

ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, పీఆర్వో బీఏ రాజు హాఠాన్మరణం యావత్‌ టాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగంలో ఉన్న ఆయనతో అనుబంధాన్ని పలువురు సెలబ్రిటీలు గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో ఆయన స్పెషల్‌ బాండింగ్‌ కొనసాగించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మహేష్‌బాబు సోషల్‌ మీడియాలో ఎమోషన్‌ అయ్యాడు.

‘‘బీఏ రాజుగారు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. సినీ పరిశ్రమలో ఆయనకొక జెంటిల్‌మ్యాన్‌. నిబద్ధతతో పనిచేసేవారు. ఆయన మరణాన్నితట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌బాబు పోస్ట్‌ చేశాడు.

ఇక బీఏ రాజు మరణవార్త తెలియగానే షాక్‌కి గురయ్యానంటూ జూనియర్‌ ఎన్జీఆర్‌ ట్వీట్‌ చేశాడు. పీఆర్వోగా, జర్నలిస్ట్‌గా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి గొప్పసేవలు ఆయన అందించాడని, రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశాడు. 

దర్శకులు సంపత్‌ నంది,  మెహర్‌ రమేష్‌లు, యంగ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌, రైటర్‌ గోపీ మోహన్‌, దర్శకనిర్మాత మధురా శ్రీధర్‌ తదితరులు సోషల్‌ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

మరిన్ని వార్తలు