‘సర్కారు వారి పాట’కు కరోనా దెబ్బ

4 Apr, 2021 09:14 IST|Sakshi

సర్కారువారి పాట కోసం గోవా వెళ్లాలనుకున్నారు మహేశ్‌ బాబు అండ్‌ టీమ్‌. కానీ ప్రస్తుతానికి ఆ పాటేదో ఇక్కడే పాడేద్దామనుకుంటున్నారు. మహేశ్‌ హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ పాటకు సంబంధించిన కీలక సన్నివేశాలను గోవాలో చిత్రీకరించాలనుకున్నారు. త్వరలో గోవా ప్రయాణం అవ్వాలనుకుంది టీమ్‌.

కానీ కరోనా ప్రభావం ఎక్కువ ఉన్నందున ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకుందని తెలిసింది. ఈ నెల 15న హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ఆరంభించి, దాదాపు 25 రోజుల పాటు ఇక్కడే చిత్రీకరణ జరపాలనుకుంటున్నారని తెలిసింది. ఆ తర్వాత గోవా వెళతారట. ఈ చిత్రంలో మహేశ్‌ బాబు సరసన కీర్తి సురేశ్‌ కథా నాయికగా నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు