‘సర్కారువారి పాట’ సినిమాలో ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్కు మహేశ్బాబు క్లాస్ తీసుకునే సీన్ ఉన్నట్లు ఓ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన సీన్ అంటూ నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘‘పొద్దున్నే లేచి వాకింగ్ చేశామా?.. మంచి డైట్ ఫుడ్ తిన్నామా? మళ్లీ సాయంత్రం అయ్యాక మొబైల్ చూశామా?, కొడుకు, మనవడు, మనవరాలితో ఆడుకుని.. మళ్లీ తిని పడుకున్నామా? లేదా?, ఇదే కదా మనం చేసేది రోజూ..’ అని మహేశ్బాబు డైలాగ్ చెబుతున్న వీడియో అది.
మరి.. సినిమాలో ఇది ఉంటుందా? లేదా అనేది విడుదల తర్వాత తెలుస్తుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తీ సురేష్ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.