SSMB : క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌ ఎవరంటే..

9 Aug, 2021 17:06 IST|Sakshi

SSMB28 Update : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను వెల్లడించింది చిత్ర బృందం. ఇప్పటివరకు ఈ సినిమాలో మహేశ్‌కు జోడీగా ఎవరు నటిస్తారన్న సస్పెన్స్‌ను తెరదించుతూ బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనౌన్స్‌ చేసింది. ఇక హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఎ.ఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరక్టర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.

‘అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో  వస్తున్న మూడో చిత్రం ఇది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మహేశ్‌బాబు పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మహేశ్‌-త్రివిక్రమ్‌ల మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. 

మరిన్ని వార్తలు