Manchu Vishnu: మంచు ఫ్యామిలీ నుంచి సింగర్స్‌

20 Jul, 2022 15:32 IST|Sakshi

మంచు విష్ణు, సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు విష్ణు. ఈ మూవీతో తన కూతుళ్లు సినీరంగంలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ లేఖ వదలగా అది కాస్తా వైరల్‌గా మారింది.

'నేను ఈ సినీపరిశ్రమలోనే పుట్టాను, సినిమా సెట్స్‌లోనే పెరిగాను. ఎప్పుడూ నేను నటుడ్ని అవ్వాలనే కోరుకున్నాను, అనుకున్నది సాధించాను. ఒక నటుడి ప్రయాణం కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. కానీ ఒక నటుడిగా నేను మీ నుంచి పొందే ప్రేమాభిమానాల ముందు ఈ సవాళ్లతో కూడిన ప్రయాణం కష్టమనిపించదు. ప్రతి తెలుగువాడు నా కుటుంబ సభ్యుడు. నేను ఎప్పుడూ వారికి దూరంగా లేను. ఆ కారణం చేతనే నాకు పిల్లలు పుట్టినప్పుడు మీ బ్లెస్సింగ్స్‌ కోసం వాళ్లను మీ ముందుకు తీసుకువచ్చాను.

ఒక తండ్రిగా, నటుడిగా నా కూతురులైన అరియాన, వివియానలను గాయనీమణులుగా, నటీమణులుగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జిన్నాలో మన అరియాన, వివియాన కలిసి ఓ పాట పాడారు. దీనికి సంబంధించిన వీడియో సాంగ్‌ ఈ నెల 24 ఆదివారం ఉదయం 11.13 నిమిషాలకు రిలీజ్‌ కానుంది. వాళ్లు నటీమణులు అవ్వాలనేది నా కల. కానీ వారు ఏమార్గం ఎంచుకుంటారనేది పూర్తిగా వాళ్ల ఇష్టం' అని రాసుకొచ్చాడు.

చదవండి:  ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..
 చైసామ్‌ మా అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు, గొడవపడేవారు కాదు

మరిన్ని వార్తలు