Manchu Family: ఆ పోస్టులు డిలీట్‌ చేయకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా..

19 Feb, 2022 19:52 IST|Sakshi

మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల అనంతరం మంచు కుటుంబంపై ట్రోల్స్‌ ఎక్కువయ్యాయి. మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఈ ట్రోల్స్‌ మరింత శృతి మించాయి. సోషల్‌ మీడియాల్లో ఎక్కడ చూసిన విష్ణు మంచు, లక్ష్మి ప్రసన్నలపై ట్రోల్స్‌, మీమ్స్‌ దర్శనమిస్తున్నాయి. ఇక తాజాగా మోహన్‌ బాబు సన్నాఫ్‌ ఇండియా మూవీపై ట్రోల్స్‌ పుట్టుకొస్తున్నాయి.

చదవండి: భీమ్లా నాయక్‌కు ఓటీటీల పోటీ, భారీ డీల్‌కు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థలు!

నిన్న(ఫిబ్రవరి 18) విడుదలైన సన్నాఫ్‌ ఇండియా మూవీపై ట్రోలర్స్‌ రెచ్చిపోయారు. ఈ సినిమాలోని మోహన్‌ బాబు నటన, డైలాగ్స్‌పై మీమ్స్‌ క్రియేట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు, లక్ష్మి ప్రసన్నలతో పాటు మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా వదలడం లేదు. ఇప్పటికే మోహన్‌ బాబు ట్రోల్స్‌పై స్పందించి గట్టి వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయిన ట్రోల్స్‌ ఆగకపోవడం తాజాగా మంచు ఫ్యామిలీ స్పందించింది.

చదవండి: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్‌ రైటర్‌

ఇకనైన ట్రోల్స్‌ ఆపకుంటే తీవ్ర పరిణమాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ మంచు ఫ్యామిలీ హెచ్చరించింది. ఈ మేరకు మంచు ఫ్యామిలీ టీం తరపున శేషు కుమార్‌ అనే వ్యక్తి లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా..  తక్షణమే టోల్స్‌కు సంబంధించిన వీడియోలు, మీమ్స్‌ పోస్ట్‌లు డిలిట్‌ చేయాలని, లేదంటే క్రిమినల్‌ కేసులు పెట్టి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు