చిరంజీవి చిరు బ్రేక్ తీసుకున్నాడు. ఆచార్య షూటింగ్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న ఆయన తన జిగిరీ దోస్త్, విలక్షణ నటుడు మోహన్బాబును వెంటేసుకుని స్పెషల్ టూర్కు వెళ్లాడు. ఈ విషయాన్ని మోహన్బాబు కుమార్తె లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు వారిద్దరూ ఒకే ఫ్రేములో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. "ఇద్దరు మేధావులు సిక్కిం ట్రిప్కు వెళ్తే ఎంత రచ్చ రచ్చ చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి అంకుల్ వీకెండ్ ట్రిప్కు నాన్నను దగ్గరుండి ఒప్పించి మరీ తీసుకెళ్లాడు. ఈ విషయంలో నాకు కొంత ఈర్ష్యగానే ఉంది. కానీ మీ ఇద్దరూ కాలక్షేపం చేసేందుకు సమయం దొరికినందుకు నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. కానీ ఈ ట్రిప్లో ఏదో ఒక రోజు మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతాము" అని ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులు మమ్మల్ని కూడా తీసుకెళ్తే ఎంత బాగుంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
When two maestros go for a quick trip to Sikkim, you know it’s going to be 🔥
— Lakshmi Manchu (@LakshmiManchu) March 15, 2021
Only @KChiruTweets uncle you could have convinced Nana for a quick weekend trip to Sikkim! I’m so jealous! So good to see you both having a nice time. Heart is full! Let us kids accompany you someday 😝 pic.twitter.com/9EGBN7Tjam
కాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య'లో తనయుడు రామ్చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీకొడుకుల సరసన కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం సమ్మర్లో మే 13న రిలీజ్ కానుంది. మరోవైపు మోహన్బాబు దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కుతున్న 'సన్నాఫ్ ఇండియా’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ పతాకం సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.