Manchu Manoj : 'తారకరత్న వందశాతం కోలుకొని తిరిగి వస్తాడు'.. మనోజ్‌ కామెంట్స్‌

30 Jan, 2023 10:09 IST|Sakshi

సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అతని ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉన్న నేఫథ్యంలో కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్య అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తుండగా నిన్న(ఆదివారం)తారక్‌, కల్యాణ్‌ రామ్‌లు కుటుంబసమేతంగా బెంగళూరులోని హాస్పిటల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

తాజాగా నటుడు మంచు మనోజ్‌ తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు వెళ్లారు. అతని ఆరోగ్యంపై వైద్యులను అడిగిన తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'తారకరత్నను చూడటం జరిగింది. రికవరీ అవుతున్నాడు. త్వరలోనే కోలుకొని బయటకు వచ్చేస్తాడు.

తారకరత్న స్ట్రాంగ్‌ ఫైటర్‌. అతనికి ఇది టెస్టింగ్‌ టైమ్‌. నేను వందశాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల తారకతరత్న త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు