Manchu Mohan Babu: మంచు మోహన్‌బాబు ఇంట తీవ్ర విషాదం

17 Nov, 2021 19:51 IST|Sakshi

సాక్షి, తిరుపతి: టాలీవుడ్‌ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణంతో మోహన్ బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చదవండి: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నమూత

కాగా మంచు రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 8-9 గంటల మధ్య తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇక తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి.. మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు.

మరిన్ని వార్తలు