Manchu Vishnu Comments on Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై తాజాగా ‘మా’ నూతన అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్తో విష్ణు ముచ్చటించాడు. ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికలు, మెగా కుటుంబంతో ఉన్న రిలేషన్స్పై మాట్లాడాడు. ఈ క్రమంలో బన్నీ తనకు మంచి స్నేహితుడని, తరచూ తామిద్దరం చాట్ చేసుకుంటామని తెలిపాడు. అలాగే అల్లు అర్జున్ అంటే అసూయ కలిగిందని, అదే సమయంలో బన్నీని చూసి గర్వంగా కూడా ఫీల్ అవుతున్నానంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
చదవండి: వీకెండ్ ఇలా అద్భుతంగా గడిచింది: సమంత
ఈ మేరకు విష్ణు మాట్లాడుతూ.. ‘‘బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ కూడా విడుదలకు సిద్దమైంది. దీంతో బాలీవుడ్కు చెందిన పలు మ్యాగజైన్స్, వార్త పత్రికలు తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్, ఆమిర్ ఖాన్కు పోటీ ఇవ్వబోతున్నాడని రాశాయి. అది చూసి బన్నీ అంటే అసూయ కలిగింది, అదే సమయంలో ఓ తెలుగు హీరోగా తనని చూసి గర్వపడ్డాను. ఇదే విషయాన్ని బన్నీకి కూడా చెప్పాను. ‘బ్రదర్, నేను నిన్ను చూసి అసూయపడుతున్నాను కానీ మీమ్మల్ని చూసి గర్వపడుతున్నా’ అని మెసెజ్ చేశాను’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: మలయాళంలోకి 'లవ్ స్టోరీ'.. టైటిల్ ఎంటో తెలుసా?
అనంతరం పుష్ప మూవీ మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని విష్ణు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బన్నీకి విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాగా పుష్ప పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రానుంది. రెండు భాగాలుగా రానున్న పుష్ప ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్కు సిద్ధమవుతుండగా.. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
చదవండి: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు