Manchu Vishnu: నాన్న, చిరంజీవి నిన్న ఫోన్‌లో మాట్లాడుకున్నారు..

18 Oct, 2021 12:43 IST|Sakshi

Manchu Vishnu About Pawan Kalyan: అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌, తాను మాట్లాడుకోకపోవడంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మాట్లాడుకున్నాం అని, అయితే ఉప రాష్రపతి ఉండట వల్ల స్టేజ్‌పై మాత్రమే మాట్లాడుకోలేదని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం అనంతరం పోస్ట్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ..పవన్‌ ఫ్యాన్స్‌ కోసమే ఆ వీడియోను షేర్‌ చేసినట్లు తెలిపారు.

తమ మధ్య విభేదాలు లేవని, పవన్‌కల్యాణ్‌ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని పేర్కొన్నారు. అంతేకాకుండా నిన్న తండ్రి మోహన్‌బాబు-చిరంజీవి ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు వివరణ ఇచ్చారు. కాగా బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో మంచు విష్ణు- పవన్‌ కల్యాణ్‌ ఎదురుపడినా ఇద్దరి మధ్యా మాటల్లేవ్‌ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్‌ బాబు సీరియస్‌

చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి
శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అండ్‌ టీం

మరిన్ని వార్తలు