ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. . కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందించి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇక మొదటి భాగంగా గత నెల సెప్టెంబర్ 30న తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తెలుగులో మాత్రం పెద్దగా వసూళు చేయలేదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పొన్నియన్ సెల్వన్ రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: మరో మహిళతో భార్యకు దొరికిపోయిన నిర్మాత.. కారుతో భార్యను తొక్కించి..
ఇక థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్కు రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైం సొంతం చేసుకుందని, నవంబర్ మొదటి, రెండు వారాల్లో పొన్నియన్ సెల్వన్ అందుబాటులోకి రానుందనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, కార్తి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లతో పాటు మణిరత్నం కూడా నిర్మించారు.
#PonniyinSelvan Streaming On #PrimeVideo
— Tamil TV Satellites Rights (@TTSR_Official) October 24, 2022
Coming Soon#vikram #karthi #jayamravi #parthiban #prakashraj #jayaram #vikramprabhu #prabhu #rahuman #aishwaryarai #trisha #aishwaryalekshmi #sobhitadhulipala #ott #diwali2022 #diwali #tamiltvsatellitesrights #vijayavikash#VIJAYAVIKASHM pic.twitter.com/vVEdp3tHfV