Chiranjeevi : 'ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపింది'.. ప్రధాని మోదీకి చిరంజీవి సంతాపం

30 Dec, 2022 10:46 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్లలి హీరాబెన్‌ మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని తల్లి శ్రీమతి హీరాబెన్‌ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపింది. స్వర్గలోకానికి వెళ్లిన ఆమె ఆత్మకు నా నివాళులు. నరేంద్ర మోదీ జీకి నా హృదయపూర్వక సానుభూతి! ఓం శాంతి!....అంటూ చిరంజీవి ‍ట్వీట్‌ చేశారు.

ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోదీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా రెండురోజుల క్రితం​ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోదీ తల్లి హీరాబెన్ అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలె ఆమె వందో పుట్టినరోజును జరుపుకున్నారు. 


 

మరిన్ని వార్తలు