Michael Movie In OTT: అప్పుడే ఓటీటీలోకి పాన్‌ ఇండియా మూవీ ‘మైఖేల్‌’?

11 Feb, 2023 16:15 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం మైఖేల్‌. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.  భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం..తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ని సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టుకోలేకపోయింది. 

ఇక థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. మాములూగా అయితే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ సినిమాకు యావరేజ్‌ టాక్‌ రావడంతో.. త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారట.

ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. . కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించి ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు