Minister Talasani Srinivas Yadav: ట్రైలర్​ ఆద్యంతం ఆసక్తిగా ఉంది: మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్

6 Jun, 2022 16:23 IST|Sakshi

Minister Talasani Srinivas Yadav Launches Kerosene Trailer: ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సస్పెన్స్​ థ్రిల్లర్​ 'కిరోసిన్'​. బిగ్​ హిట్​ ప్రొడక్షన్స్​ బ్యానర్​పై వస్తున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17న గ్రాండ్​గా విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందానికి మంత్రి తలసాని ఆల్​ ది బెస్ట్​ చెప్పారు. 2 నిమిషాల 14 సెకన్ల ట్రైలర్​ ఆద్యంతం ఆసక్తిగా ఉందన్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ ట్రైలర్​ లాంచ్​ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ పృధ్వీ యాదవ్, దీప్తి కొండవీటి, కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, వెంకన్న ముదిరాజ్, హేమంత్ యాదవ్, సురేంద్ర, స్వాతి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు