త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెబుతా : హీరోయిన్‌

7 Jun, 2021 00:15 IST|Sakshi

‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మృణాళినీ రవి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారట. ప్రస్తుతం తమిళ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారామె. విక్రమ్‌ సరసన ‘కోబ్రా’, విశాల్‌తో ‘ఎనిమి’ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో నటించనున్నారని టాక్‌. ఈ సందర్భంగా మృణాళిని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల అభిమానం ఒక రేంజ్‌లో ఉంటుంది. ఒక్కసారి ఆ అభిమానాన్ని రుచి చూసిన వాళ్లెవరైనా అంత తేలిగ్గా మర్చిపోలేరు. నటనతో పాటు గ్లామర్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ కరోనా లాక్‌డౌన్‌లో కొందరు తెలుగు దర్శకులు చెప్పిన కథలను ఆన్‌లైన్‌లో విన్నాను. త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెబుతాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు