Mithun Chakraborty: ఆసుపత్రి పాలైన నటుడు, హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన తనయుడు

2 May, 2022 17:18 IST|Sakshi

Mithun Chakraborty Hospitalised Photos Goes Viral: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవరి ఆసుపత్రి పాలయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరారు. బీజేపీ నాయకుడు అనుపమ్‌ హజ్రా ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆసుపత్రిలోని ఆయన ఫొటోలను ట్వీట్‌లో షేర్‌ చేశారు. దీంతో ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉన్న మిథున్‌ చక్రవర్తి ఫొటోలు సోషల్‌ మీడయా వైరల్‌గా మారాయి. ఆకస్మాత్తుగా మిథున్‌ చక్రవర్తి ఆసుప్రతి పాలవడంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. 

దీంతో ఆయన రెండో కుమారుడు మిమో చక్రవర్తి ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఇండియా టూడేతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఆయన కిడ్నీ స్టోన్స్ పెయిన్‌ ఏప్రిల్‌ 30న ఆసుప్రతి చేరినట్టు చెప్పాడు. ఆయనకు ఆపరేషన్‌ జరిగిందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చక్రవర్తి చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా 80, 90లలో హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో చక్రం తిప్పారు మిథున్‌ చక్రవర్తి. ఇక చివరగా మిథున్‌ ‘ది కాశ్మీర్‌ ఫైల్స్’ చిత్రంలో నటించి మెప్పించారు. 

మరిన్ని వార్తలు