‘సన్నాఫ్‌ ఇండియా’ రెడీ అయ్యారు

28 Jan, 2021 08:06 IST|Sakshi

సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవడానికి సన్నాఫ్‌ ఇండియా రెడీ అయ్యారు. సన్నాఫ్‌ ఇండియా ఎలా ఉంటారో చిన్న లుక్‌ ద్వారా పరిచయం చేస్తారట. మోహన్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సోషల్‌ డ్రామా ‘సన్నాఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. మంచు విష్ణు, లక్ష్మీ మంచు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రేపు రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. సమాజాన్ని సరిదిద్దాలని  ప్రయత్నించే పవర్‌ఫుల్‌ వ్యక్తిగా మోహన్‌బాబు కనిపిస్తారని టాక్‌. ఈ సినిమాకు మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం.

మరిన్ని వార్తలు