Mahesh Babu And Mohan Babu: 33 ఏళ్ల తర్వాత.. మహేశ్ ​బాబుతో మోహన్​ బాబు !

25 Jan, 2022 16:15 IST|Sakshi

Mohan Babu In Trivikram Mahesh Babu Movie: సూపర్ స్టార్​ మహేశ్​ బాబు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పరశురామ్​ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్​లో మహేశ్ సినిమా ఉండనుంది. మహేశ్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తు ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు' ఎంతపెద్ద హిట్​ సొంతం చేసుకుందో తెలిసిందే. తర్వాత వచ్చిన 'ఖలేజా' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్​లో ముచ్చటగా మూడోసారి మూవీ రానుందంటే ఆడియెన్స్​లో కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి. 

అందుకు తగినట్లుగానే సినిమా క్యాస్టింగ్​ను త్రివిక్రమ్​ ఎంచుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ సినిమాలో మహేశ్​ బాబుకు చెల్లెలి పాత్రలో స్టార్​ హీరోయిన్​ సాయి పల్లవిని తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో విలక్షణ నటుడు మోహన్​ బాబు నటించనున్నారని సమాచారం. మహేశ్​ బాబుకు మామయ్యగా మోహన్ బాబు యాక్ట్​ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పాత్రను తివిక్రమ్​ చాలా వైవిధ్యంగా రూపొందించారని టాక్​. ఇదిలా ఉంటే 1989లో సూపర్ స్టార్​ కృష్ణ హీరోగా ఆయన డైరెక్షన్​లోనే తెరకెక్కిన సినిమా 'కొడుకు దిద్దిన కాపురం'లో మోహన్ బాబు విలన్​గా నటించారు. 

ఈ సినిమాలో మహేశ్​ బాబు బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. మళ్లీ 33 సంవత్సరాల తర్వాత మరోసారి మోహన్​ బాబు, మహేశ్​ బాబు కలిసి నటించనుండడం విశేషం. మరీ ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు