Drishyam 3: సినీ ప్రియులకు పండగే.. త్వరలో 'దృశ్యం 3'

14 Aug, 2022 15:20 IST|Sakshi

Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, సీనియర్‌ హీరోయిన్‌ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2.  మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్‌ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్‌, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్‌ల కథగా చెప్పుకోవచ్చు. 

అయితే తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్‌లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్‌' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మోహన్‌ లాల్‌ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమా పోస్టర్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్‌ అవుతున్నారు.  కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు