భారీ కుంభకోణం

19 Sep, 2020 02:34 IST|Sakshi

మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ బ్రదర్‌ – సిస్టర్‌గా నటిస్తోన్న క్రాస్‌ఓవర్‌ చిత్రం ‘మోసగాళ్లు’. శుక్రవారం హీరో వెంకటేశ్‌ ఈ చిత్రానికి సంబంధించిన ‘ది రైజ్‌ ఆఫ్‌ మోసగాళ్లు’ (టైటిల్‌ థీమ్‌ మ్యూజిక్‌)ను విడుదల చేశారు. ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. భారత్‌లో మొదౖలై అమెరికాను సైతం వణికించిన చరిత్రలోనే అతి పెద్ద భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌కుమార్‌ ఆర్‌.

మరిన్ని వార్తలు