ఘనంగా సినీ తారల అవార్డుల వేడుక..

16 Aug, 2021 15:54 IST|Sakshi

చెన్నై: సినీ, బుల్లితెర తారల అవార్డుల వేడుక శనివారం స్థానిక వడపళణిలోని శిఖరం హాలులో ఘనంగా జరిగింది. మహా ఆర్ట్స్‌ అధినేత అనురాధ జయరాం, యునైటెడ్‌ ఆరి్టస్ట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత నెల్‌లై సుందరరాజన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ఎస్‌.కె.కృష్ణన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను అందుకున్న వారిలో నటి జ్యోతి మీనా, ఎస్‌.ఎస్‌.ఆర్‌.ఆర్యన్, శృతిక, మౌనిక, గానా గాయకురాలు ఇసైవాణి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు