మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా టీజర్ను దర్శకుడు క్రిష్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి’’ అన్నారు అనిల్ పంగులూరి. ఈ చిత్రానికి సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి.