యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

1 Mar, 2023 01:28 IST|Sakshi

మాన్యం కృష్ణ, అర్చన జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్‌ కళ్యాణ్‌’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.

ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ని హీరో ఆకాశ్‌ పూరి విడుదల చేసి, ‘‘సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, లవ్‌ అండ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. మహిళలకు కనెక్ట్‌ అయ్యే  అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు