కోలీవుడ్‌ ఎంట్రీ!

30 Jan, 2023 04:11 IST|Sakshi

‘సీతారామం’(2022) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకూర్‌. ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్‌(తమిళ ఇండస్ట్రీ) నుంచి కబురొచ్చిందట. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఓ హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌ రూపొందుతోంది. ఈ సినిమాలో దిశా పటానీ ఓ హీరోయిన్‌.

కాగా ఈ మూవీలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ సన్నివేశాల్లో సూర్య సరసన నటించేందుకు మరో హీరోయిన్‌కి అవకాశం ఉందట. ఈ రోల్‌లోనే మృణాల్‌ ఠాకూర్‌ నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. అంతేకాదు.. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లో మృణాల్‌ జాయిన్‌ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఖరారు అయితే కోలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి ప్రాజెక్టు అవుతుంది. కాగా తెలుగులో నాని హీరోగా నటించనున్న ఓ కొత్త సినిమాలో మృణాళ్‌ హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు