మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌: కోటి

24 Sep, 2022 10:10 IST|Sakshi

‘‘నేను ఈ రోజు ఇంత పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావడానికి కారణమైన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని సంగీత దర్శకుడు, నటుడు కోటి అన్నారు. అభిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా రవి శ్రీ దుర్గా ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పగ పగ పగ’. సుంకర బ్రదర్స్‌ సమర్పణలో సత్యనారాయణ సుంకర నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. శుక్రవారం జరిగిన సక్సెస్‌ మీట్‌లో కోటి మాట్లా డుతూ– ‘‘పగ పగ పగ’ సినిమాకు మ్యూజిక్‌ చేద్దామని వెళ్లాను.. అయితే దాంతోపాటు నాతో యాక్టింగ్‌ కూడా చేయించారు. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.. ఇంకా పెద్ద హిట్‌ చేయాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని చూడనివారు చూసి, మమ్మల్ని ఆశీర్వదించాలి’’ అన్నారు రవి శ్రీ దుర్గా ప్రసాద్‌.

నిర్మాతలు సత్య నారాయణ  సుంకర, ఫైట్  మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ.. ‘మా స్టంట్‌ మాస్టర్‌ యూనియన్‌ సపోర్ట్‌ వల్లే ఈ సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన చూసి, మా కష్టం మరచిపోయాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో  ఈ చిత్రం తీయడం జరిగింది.  కోటి గారితో  వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీ గా ఉంది. మా తమ్ముడు హీరోగా అద్భుతంగా నటించాడు. సీనియర్ నటుల సపోర్ట్ మరవలేనిది’అన్నారు. 

చిత్ర హీరో అభిలాష్ సుంకర మాట్లాడుతూ..  ఇప్పటివరకు ఫైటర్ గా  నేను  320 సినిమాలకు వర్క్ చేశాను. మా అన్నలు నన్ను నమ్మి నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. వారికి నా పాదాభివందనాలు, దర్శకులు రవి గారు మంచి కథ ఇచ్చి మమ్మల్ని  బాగా డైరెక్ట్ చేశారు. కోటి గారి మ్యూజిక్ వింటూ పెరిగిన నేను తనతో కలసి నటించడంతో పాటు, మ్యూజిక్ కూడా తనే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు.

మరిన్ని వార్తలు