S. S Thaman : 'సర్కారువారి పాట' నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన తమన్‌

22 Oct, 2021 19:25 IST|Sakshi

సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు పరశురాం దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతుంది.

ఆ సినిమాకు సంబంధించి ఎస్‌.ఎస్‌ తమన్‌ అభిమానులకు క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. రీసెంట్‌గా ఈ మూవీ మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తి అయినట్లు తమన్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు మహేశ్‌తో తీసుకున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇందులో సూపర్‌ స్టైలిష్‌గా మహేష్‌ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ఈ సినిమా ముందుకు రానుంది.

 చదవండి: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం
'నాట్యం' ఫేమ్‌ సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

మరిన్ని వార్తలు