సారిక మిస్టరీ

21 Aug, 2020 05:48 IST|Sakshi
ఆశి రాయ్, సాయిబాబు, సురయ పరివిన్‌

సాయిబాబు హీరోగా, ఆశి రాయ్, సురయ పరివిన్‌ హీరోయిన్లుగా రామ్‌ పల్లె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టరీ ఆఫ్‌ సారిక’. బాలాజి సమర్పణలో అనీషా క్రియేషన్స్‌ బ్యానర్‌లో సుగుణ సుబ్రమణ్యం నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘సస్పెన్స్‌ తో కూడిన చిత్రమిది’’ అన్నారు రామ్‌ పల్లె.  ‘‘సినిమా చాలా బాగా వచ్చింది.

రామ్‌ పల్లెగారు మా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో ట్రైలర్, సాంగ్స్‌ విడుదల చేయనున్నాం. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న మా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’ అని సుగుణ సుబ్రమణ్యం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మిత్ర, కెమెరా: సులమ్‌ ప్రసాద్, లైన్‌ ప్రొడ్యూసర్‌: నెహ్రు బాబు.

మరిన్ని వార్తలు