ఉదయ్ శంకర్, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా గురు పవన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. అట్లూరి ఆర్.సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురు పవన్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ లవ్స్టోరీ చిత్రమిది.
మన మొబైల్స్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ యాప్స్ వల్ల ఏదైనా తప్పు జరిగితే ఎంతమంది నష్టపోతారు? అలాంటి సమస్య నుంచి బాధితులను హీరో ఎలా బయటపడేశాడు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఉదయ్శంకర్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. జెన్నీఫర్కు ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది’’ అన్నారు.