Nagababu: ఆయన ఇమేజ్ చూస్తే ఎవరికైనా అంతే: నాగబాబు

6 Oct, 2022 18:58 IST|Sakshi

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి  అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ  ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ వేడుకలో జరిగిన సంఘటనపై ఆయన ఈ విధంగా కౌంటరిచ్చినట్లు తెలుస్తోంది.

(చదవండి: గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి)

అసలేం జరిగిందంటే: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్‌ బలయ్‌ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్‌ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు