ప్రేమతో ఓ బహుమతి

15 Sep, 2020 06:46 IST|Sakshi

నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌స్టోరీ’. కరోనా బ్రేక్‌ తర్వాత ఇటీవలే మళ్లీ చిత్రీకరణ  ప్రారంభం అయింది. ఈ చిత్రబృందం చైతన్య అభిమానులకు ఓ బహుమతి ప్లాన్‌ చేసిందని సమాచారం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌ నార ంగ్‌ నిర్మాత. ఈ నెల 20న దివంగత నటులు, నాగచైతన్య తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను ఆ రోజు విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ‘లవ్‌స్టోరీ’ను పూర్తి చేస్తున్నారు. మరో వారం రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు. ఈ చిత్రానికి పవన్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు