Nagarjuna Akkineni: వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుంటానన్న నాగార్జున!

13 Dec, 2021 00:49 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోలో ప్రత్యేక అతిథిగా ఎంపీ సంతోష్‌ కుమార్‌

Bigg Boss Telugu 5, Nagarjuna Akkineni: కోట్లాది మొక్కలు నాటించడమే లక్ష్యంగా ఆకుపచ్చని తెలంగాణే ధ్యేయంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఎంతో పాటుపడుతున్నారు. పచ్చదనమే రేపటి ప్రగతి పథమని బిగ్‌బాస్‌ షో వేదికగా చాటిచెప్పారు. ఆదివారం(డిసెంబర్‌ 12న) ఆయన బిగ్‌బాస్‌ షోకు ప్రత్యేక విచ్చేసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ గురించి మాట్లాడారు. ఈ చాలెంజ్‌ ప్రారంభమై 3 సంవత్సరాలు పూర్తైందన్న ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లో నాటమని హోస్ట్‌ నాగార్జునకు ఒక మొక్కను బహుకరించడం విశేషం. 

గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటానన్న ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ చాలెంజ్‌లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి  అడవులను దత్త తీసుకున్నారని తెలిపారు. హీరో ప్రభాస్‌ 1650 ఎకరాలు దత్తత తీసుకుని దాన్ని హరితవనంగా మార్చేందుకు సిద్ధపడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ముందుకు రావడం విశేషం. ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి నాగ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజలు కూడా మూడు వారాలు మూడు మొక్కలు నాటి ఈ ఏడాదికి మంచి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చాడు.

మరిన్ని వార్తలు